GK Telugu

భారతదేశ స్వాతంత్రోద్యమం ముఖ్య సంఘటనలు – The major events of India’s independence movement


➤  1885 డిసెంబర్ 28న భారత జాతీయ కాంగ్రెస్ ను స్థాపించారు 
➤  1885 – 1905 మధ్య కాలాన్ని మితవాడ దశగా పేర్కొంటారు 
➤  1905 – 1920 మధ్య కాలాన్ని అతివాద దశగా పేర్కొంటారు 
➤  1905 జూలై 20న బెంగాల్ విభజన ప్రకటన వెలువడింది 
➤  1906 డిసెంబర్ 31న ముస్లిం లీగ్ పార్టీని స్థాపించారు. 
➤  1907లో సూరత్తో కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఈ సమీవేశంలో కాంగ్రెస్ నాయకులు మితవాదులు, అతివాదులుగా విడిపోయారు

➤  1908 ఏప్రిల్ 30న ఖుదీరాంబోసను ఉరి తీశారు 

➤  1909 మే 21న మింటోమార్లే సంస్కరణలను ప్రవేశ పెట్టారు. 
➤  1911లో బెంగాల్ విభజనను రద్దు చేశారు 
➤  1912లో రాజధానిని కోల్ కతా నుంచి ఢిల్లీకి మార్చారు 
➤  1913 నవంబరు 1న శాన్ ఫ్రాన్సిస్కోలో గదర్ పార్టీని స్థాపించారు 
➤  1914-1918 మధ్య కాలంలో మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది 
➤  1915 జనవరిలో గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి భారత్ కు తిరిగి వచ్చారు
➤  1916లో గాంధీజీ సబర్మతి ఆశ్రమాన్ని స్థాపించారు 
➤  1915 ఫిబ్రవరి 19న గోపాలకృష్ణ గోఖలే మరణించారు 
➤  1916లో లఖ్ నవూ (లక్నో) ఒడంబడిక జరిగింది 
➤  1916లో హోమ్ రూల్ ఉద్యమం ప్రారంభమైంది
➤  1917లో చంపారన్ సత్యాగ్రహం జరిగింది 
➤  1917లో అనిబిసెంట్ భారత జాతీయ కాంగ్రెస్ కు తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. 
➤  1918 అహ్మదాబాద్లో నూలు మిల్లుల సందర్శన జరిగింది

➤  1919లో ఖిలాఫత్ ఉద్యమం ప్రారంభమైంది 

➤  1919 ఏప్రిల్ 6న రౌలట్ చట్టం చేశారు. 
➤  1919 ఏప్రిల్ 13న జలియన్ వాలాబాగ్ ఉదంతం చోటుచేసుకుంది 
➤  1919లో హంటర్ కమిషన్ ఏర్పాటైంది 
➤  1919 డిసెంబరు 5న మాంటేగ్ ఛేమ్స్ ఫర్డ్ సంస్కరణలను ప్రకటించారు 
➤  1920లో బాలగంగాధర తిలక్ మరణించారు. 
➤  1920లో ఎం.ఎన్. రాయ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాను స్థాపించారు
➤  1920 – 1947 మధ్య కాలాన్ని గాంధీజీ దశగా పేర్కొంటారు. 
➤  1920 -22 మధ్య సహాయ నిరాకరణోద్యమం జరిగింది.
➤  1922 ఫిబ్రవరి 5న చౌరీ చౌరా ఉదంతం చోటుచేసుకుంది 
➤  1922లో కేరళలో మోప్లాల తిరుగుబాటు జరిగింది 
➤  1923లో స్వరాజ్ పార్టీని స్థాపించారు 
➤  1925లో కకోరీ కుట్ర కేసు నమోదైంది. 
➤  1927లో బట్లర్ కమిషన్, సైమన్ కమిషన్లను ఏర్పాటుచేశారు 
➤  1928లో మోతీలాల్ నెహ్రూ ఒక రిపోర్ట్ ను రూపొందించారు
➤  1928లో లాలాలజపతిరాయ్ మరణించారు.
➤  1928లో చంద్రశేఖర్ ఆజాద్ హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ ను స్థాపించారు

➤  1929 ఏప్రిల్ 8న భగత్ సింగ్, భతుకేశ్వర్ దత్ ఢిల్లీలోని అసెంబ్లీపై బాంబులు వేశారు 

➤  1929 డిసెంబరు 31న లాహోర్ లో జరిగిన కాంగ్రెస్ సమావేశానికి నెహ్రూ అధ్యక్షత వహించారు
➤  1929లో శారదా వివాహ చట్టాన్ని రూపొందించారు 
➤  1929 అక్టోబరు 31న భారత్ కు డొమినియన్ ప్రతిపత్తి కల్పించారు 
➤  1930 మార్చి 12న ఉప్పు సత్యాగ్రహం జరిగింది
➤  1930 నవంబరు 30న మొదటి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
➤  1931 ఫిబ్రవరి 27న చంద్రశేఖర్ ఆజాద్ ఎన్ కౌంటర్ జరిగింది 
➤  1931 మార్చి 23న భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లను ఉరి తీశారు. 
➤  1931 సెప్టెంబరు 7న రెండో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది 
➤  1932 నవంబరు 17న మూడో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. 
➤  1931 మార్చి 5న గాంధీ ఇర్విన్ ఒప్పందం కుదిరింది 
➤  1932 ఆగస్టు 16న కమ్యూనల్ అవార్డును ప్రకటించారు. 
➤  1932లో పూనా ఒడంబడిక జరిగింది. 
➤  1935లో భారత ప్రభుత్వ చట్టాన్ని రూపొందించారు. 
➤  1937లో 1935 చట్టం ప్రకారం ఎన్నికలు జరిగాయి.
➤  1939లో త్రిపురలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో సుభాష్ చంద్రబోస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో భోగరాజు పట్టాభి సీతారామయ్య ఓడిపోయారు. 

➤  1939 – 45 మధ్య కాలంలో రెండో ప్రపంచయుద్ధం జరిగింది. 
➤  1939లో నేతాజీ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించారు. 
➤  1939 కాంగ్రెస్ మంత్రివర్గాలు రాజీనామా చేశాయి. 
➤  1940 ఆగస్టు 10న ఆగస్టు ప్రతిపాదనలకు సంబంధించిన ప్రకటన వెలువడింది 
➤  1940 అక్టోబరు 17న వ్యక్తి సత్యాగ్రహ ఉద్యమం ప్రారంభమైంది
➤  1942 మార్చి 11న క్రిప్స్ రాయబారం 
➤  1942 ఆగస్టు 8న క్విట్ ఇండియా ఉద్యమం మొదలైంది.
➤  1946 క్యాబినెట్ మిషన్ ప్రణాళికను రూపొందించారు. 
➤  1946లో నెహ్రూ అధ్యక్షతన తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. 
➤  1947 మార్చి 24న మౌంట్ బాటన్ గవర్నర్ జనరల్ గా నియమితులయ్యారు. 
➤  1947 ఆగష్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!