ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో నైట్ వాచ్ మెన్ ఉద్యోగాల భర్తీకి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశం లో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది.
రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నాడు నేడు పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించారు. ఇవే కాకుండా కొన్ని పాఠశాలల్లో స్మార్ట్ టివిలు , ఇంటరాక్టివ్ ప్యానెల్ లు ఏర్పాటు చేశారు. అయితే కొన్ని పాఠశాలల్లో రాత్రివేళ దొంగతనాలు జరుగుతున్నాయని, విలువైన వస్తువులు చోరీకి గురవుతున్నాయని పిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇందులో భాగంగా 5388 నైట్ వాచ్ మెన్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వారికీ గౌరవ వేతనంగా 6000 రూపాయలను ఇవ్వనున్నారు.
ఈ ఉద్యోగాలకు ఇప్పటికి ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఆయా భర్తకు మొదటి ప్రాధాన్యం ఇస్తారు, రెండవ ప్రాధాన్యం మాజీ సేవ పురుషులకు ఇస్తారు. ఈ రెండు విభాగాలలో అర్హులు లేకుంటే పేరెంట్స్ కమిటీ నుండి అర్హతలు గల వ్యక్తికీ ఈ ఉద్యోగం ఇస్తారు.
![]() | వాట్సాప్ గ్రూప్ లింక్ |
![]() | బిజినెస్ ఐడియా గ్రూప్ లింక్ |
I am interesting this job my qualification Degree