Capture

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవతరగతి పరీక్షా ఫలితాలు శనివారం ఉదయం 11గంటలకు విడుదల అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య శాఖా మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ పదవతరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఈ సంవత్సరం మార్చి నెలలో జరిగిన టెన్త్ పరీక్షలకు సుమారుగా 6. 40 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 6,05,052 మంది మాత్రమే పరీక్షలకు హాజరు అయ్యారు.

ఇందులో బాలురు 3,09,245 మంది, బాలికలు 2,95,807మంది ఉన్నారు. విద్యార్థులు bse.ap.gov.in. వెబ్‌సైట్‌ ద్వారా ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చు. ఫలితం ఏదైనా విద్యార్థులు ధైర్యంగా ఉండాలని, తల్లిదండ్రులు వారికి సపోర్ట్‌గా నిలవాలని అధికారులు సూచించారు

ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *